ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో రసాయన పౌడర్ లోడుతో వెళ్తున్న లారీ పూర్తిగా
కాలిపోయింది. కర్ణాటక నుంచి ఒడిశాకు బయలుదేరిన ఈ లారీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లి వద్ద శనివారం అగ్నికి ఆహూతయ్యింది. డ్రైవర్లు ప్రమాదం నుంచి త్రుటిలో
తప్పించుకున్నారు. రసాయనాల ప్రభావంతో మంటలు చెలరేగి పక్కనే ఉన్న చెట్ల పొదలకూ వ్యాపించాయి. దీంతో ఇరువైపులా కిలోమీటర్ మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. – కాటారం