హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి(Cheetah killed) చెందిన సంఘటన మహబూబ్నగర్ (Mahbubnagar) జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి గ్రామ శివారులోని పొన్నకల్ స్టేజీ సమీపంలో శనివారం రాత్రి జాతీయ రహదారి 44ని దాటే క్రమంలో(Road accident) చిరుతపులిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో చిరుత అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమచారం ఇవ్వడంతో అడ్డాకుల ఎస్ఐ శ్రీనివాసులు, మూసాపేట ఎస్ఐ సుజాత సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం అటవీశాఖాధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి శవ పరీక్షలు నిర్వహించారు. అయితే గతంలోనూ తాటికొండ శివారులో చిరుత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.