హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ)/మెట్పల్లి: మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలతో అభిషేకం చేసి, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మైనార్టీలను సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నారని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. మైనార్టీల ఆర్థిక అభ్యున్నతికి దేశంలోనే చారిత్రాక ఘట్టానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ ఆనందం వ్యక్తం చేశారు.
జీవో విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేదర్ విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జాతీయ రహదారిపై సీఎం కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ను మైనార్టీ నేతలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వినోద్కుమార్ పుట్టినరోజు సందర్భంగా మైనార్టీ నాయకులు గజమాలతో సత్కరించి, కేక్ కట్ చేయించారు.