రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్లో వినూత్న తరహా లో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులకు గురువారం పంచాయతీ ఆవరణలో ఎంపీపీ మానస, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు వేణుగోపాల్రావు, ఏఎంసీ చైర్మన్ రవీందర్రెడ్డి బొట్టుపెట్టి చీరతోపాటు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. చెక్కులు అందుకొని మురిసిపో యిన లబ్ధిదారులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. – సిరిసిల్ల రూరల్