కులకచర్ల, జనవరి 23 : విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వికారాబాద్ జిల్లా చౌడాపూర్ పోస్ట్మ్యాన్ సస్పెండ్ అయ్యాడు. ‘చెత్తకుప్పలో ఆధార్కార్డులు’ శీర్షికతో ఆదివారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం విదితమే.
మంగళవారం పోస్టల్ అధికారులు విచారించి.. పోస్ట్మ్యాన్ నర్సింహులు చేసింది తప్పేనని తేలడంతో సస్పెండ్ చేసినట్టు మహబూబ్నగర్ పోస్టాఫీస్ ఎంవో జగన్నాథరావు తెలిపారు. 2011 నుంచి వచ్చిన ఆధార్, పాన్కార్డులు, ఉత్తరాలను పంపిణీ చేయకుండా నర్సింహులు ఇంట్లోనే పెట్టుకోగా అతడి కుమార్తె చెత్త ట్రాక్టర్లో పడేయగా గ్రామస్థులు గుర్తించి తహసీల్దార్కు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.