హైదరాబాద్ : రాష్ట్రంలో మూడురోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ఒకటి, రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతం నుంచి కర్ణాటక ఉత్తర ప్రాంతం వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరిత ద్రోణి ఏర్పడింది.
దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో మాదిరి వర్షాలు కురిస్తాయని స్పష్టం చేసింది. గాలివేగం గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.