TS Weather Update | హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): సోలార్ రేడియేషన్ (అల్ట్రా వయలెట్ కిరణాలు) ఎక్కువగా ఉండటం వల్లనే రాష్ట్రం లో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. సూర్యకిరణాల ప్రభావం కొంచం ఎక్కువగా ఉండ టం వల్ల చిన్నపిల్లలు, డీ-విటమిన్ లోపం ఉన్న వారు అసౌకర్యానికి గురవుతారని నిపుణులు పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి వాతావరణం వేసవిలోనే ఉంటుందని, ఆగస్టులో ఇలాంటి వాతావరణం దాదాపు ఉండదని అన్నారు. కానీ ఈ ఏడాది ఆగస్టులో వర్షాలు లేకపోవడంతో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. సాధారణంగా ఈ సమయంలో మేఘాలు ఏర్పడి సూర్యకిరణాలను అడ్డుకుంటాయి. కానీ వాతావరణంలో మార్పుల వల్ల మేఘాలు తక్కువగా ఏర్పడుతూ.. సూర్యకిరణాలు నేరుగా భూమిపై ప్రసరిస్తుండటంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్నది. 32 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 40 డిగ్రీల వరకు ఉంటున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగాయి.
రాష్ట్రంలో శుక్రవారం నుంచి వర్షాలు కురి సే అవకాశం ఉందని వాతావరణ శాఖ అం చనా వేస్తున్నది. బంగాళాఖాతం సముద్ర మ ట్టం నుంచి 4.5 నుంచి 7.6 మి.మీ ఎత్తు మధ్య లో ఆవర్తనం ఉన్నది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న ఆవర్తన ద్రో ణి 18వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతం లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో 18, 19 తేదీల్లో ఓ మోస్తరు నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. 20న కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.