హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): హజ్ యాత్రికులకు అన్ని విధాలుగా మార్గదర్శనం చేయడంతోపాటు సహాయంగా ఉండేందుకు 15 మంది ఖాదీమ్ ఉల్ హుజాజ్ (సహాయకుల)ను డ్రా పద్ధతిలో ఎంపిక చేసినట్టు హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీం వెల్లడించారు.
ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్లో ప్రారంభం కానున్న హజ్ యాత్రకు 5278 మంది యాత్రికులు హైదరాబాద్ నుంచి వెళ్లనున్నారని చెప్పారు. వారి కోసం సహాయకులను ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు.