చిన్నకోడూరు, అక్టోబర్ 1: ఎక్కడో దూరంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను ఇంత ఎత్తుపైకి తీసుకువచ్చి సిద్దిపేటలోని రంగనాయకసాగర్ను నింపడం మామూలు విషయం కాదని, ఇదో అద్భుతమని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కొనియాడారు. ఆదివారం ఆయన సతీమణితో కలిసి రంగనాయకసాగర్ పంప్హౌస్ను సందర్శించా రు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ఏఈ ఖాజా కాళేశ్వరం ప్రాజెక్టు విశేషాలను వారికి వివరించారు. ప్రాజెక్టు నిర్మాణ స్వరూపం, కాళేశ్వరం నీళ్లు తీసుకొని ఎకడెకడికి పంపిస్తున్నారనే విషయాన్ని మ్యాపు సహాయంతో క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. తాను ఇకడి వాతావరణం చూ స్తుంటే ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న అనుభూతి కలుగుతున్నదని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మంత్రి హరీశ్రావు కృషిని ప్రశంసించారు. కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యమని కాళేశ్వరం ప్రాజెక్టును చూస్తే అర్థమవుతుందని, ఈ విషయాన్ని తన ప్రవచనాల్లో ప్రస్తావిస్తానని పేర్కొన్నారు.