కరీంనగర్ : ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లమెంట్(Parliament) భవన్లో రాజదండం ప్రతిష్ఠించి రాజరిక వ్యవస్థను తీసుకురావడానికి కుట్ర రాజకీయాలకు తెరతీశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి(Chada Venkata Reddy) విమర్శించారు. మంగళవారం కరీంనగర్లోని సీపీఐ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామితో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగ(Constitution of India) ప్రకారం దేశం లౌకిక రాజ్యాంగంగా కొనసాగుతున్న తరుణంలో రాజదండంతో బీజేపీ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. ప్రజలు బీజేపీ(BJP)కి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ ప్రకారం దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( Draupadi Murmu)తో ప్రారంభించాల్సి ఉండగా ప్రధాని మోదీ నియంతలా ప్రారంభించారని మండిపడ్డారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొత్తగా నిర్మించిన పార్లమెంట్కు అన్ని పార్టీలతో సమావేశంలో ఏర్పాటు చేసి వారి సూచనల మేరకు ప్రారంభ కార్యక్రమం చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో బీజేపీ కొనసాగిస్తున్న అరాచక పాలనను వ్యతిరేకిస్తూ బీజేపీ హఠావో, దేశ్కీ బచావో నినాదంతో సీపీఐ దేశ వ్యాప్తంగా సభలు, సమావేశాలను నిర్వహిస్తుందని వెల్లడించారు.
బండి సంజయ్ సమాదానం చెప్పాలి
కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కుమార్ కేంద్రం నుంచి ప్రజలకు అవసరమైన ప్రాజెక్ట్లను ఎందుకు తీసుకరావడం లేదో సమాధానం చెప్పాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మత విద్వేషాలు తప్ప ప్రజలకు చేసిందేం లేదన్నారు. ప్రజలు బీజేపీ పాలనతో విసుగు చెందారని, అందుకు నిదర్శనమే కర్ణాటక ఎన్నికల్లో ఓటమి అని పేర్కొన్నారు.
రానున్న ఎన్నికల్లో బీజేపీ దేశంలో ఎక్కడా గెలిచే అవకాశం లేదని తెలిపారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజల వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడం కోసం జూన్ 4న కొత్తగూడెంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు లక్ష్మి, బాబు, స్వామి తిరుపతి, పైడిపల్లి రాజు, రాజయ్య పాల్గొన్నారు.