హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్లోని వివిధ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 20న ఉదయం 10.30 గంటల నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరయ్యే అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ డిపార్టుమెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్స్ (ఏఈఈ) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 15 నుంచి 22 వరకు ఉస్మానియా దవాఖానలో మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది.