హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): నూతన శాసనసభ్యులతో మూడో కొత్త అసెంబ్లీని ఏర్పాటు చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సోమవారం రాజ్భవన్లో ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాశ్ కుమార్ ఎన్నికల సంఘం విడుదల చేసిన గెజిట్ను గవర్నర్కు అందజేశారు.
నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా నవంబర్ 30న ఎన్నికలు జరిగాయి. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు అనంతరం గెలిచిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈసీ గెజిట్ ఆధారంగా కొత్త అసెంబ్లీపై గవర్నర్ పేరు మీదుగా అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు నోటిఫికేషన్ విడుదల చేశారు.