దేశాన్ని చీకట్లోకి నెట్టిన మోదీ సరారు
విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
టీఎస్ఎఫ్డీసీ చైర్మన్గా అనిల్ కూర్మాచలం బాధ్యతలు
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఢిల్లీకి బయలుదేరుతున్నారంటేనే అక్కడి ప్రభుత్వ పెద్దలకు వణుకు పుడుతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ను చూసి భయపడుతున్నందునే జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో మోదీ దండు హైదరాబాద్కు బయలుదేరిందని విమర్శించారు. దేశ ప్రజల ఆకాంక్షలు సీఎం కేసీఆర్కు బాగా తెలుసునని, వాటిని ఎకడ వ్యక్తీకరించాలో ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదని పేర్కొన్నారు. మాసబ్ ట్యాంక్లోని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్గా అనిల్ కూర్మాచలం ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. మోదీ సరారు దేశాన్ని చీకట్లోకి నెట్టిందని, ఇప్పుడు వెలుగులు నింపడం సీఎం కేసీఆర్కే సాధ్యమని అన్నారు. టీఆర్ఎస్లో సీనియారిటీకి, సిన్సియారిటీకి తప్పక గుర్తింపు ఉంటుందని.. కూర్మాచలం, సతీశ్రెడ్డి నియామకాలే అందుకు ఉదాహరణ అని తెలిపారు. తెలంగాణ ఉద్యమ కాలంలో అనిల్ కూర్మాచలం లండన్లో పోషించిన పాత్ర అద్భుతమని ప్రశంసించారు. అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. బస్ కండక్టర్ కొడుకునైన తాను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ స్థాయికి వచ్చానని, ఆ మూలాలు మరువొద్దనే ఉద్దేశంతోనే ప్రమాణస్వీకారానికి ఆర్టీసీ బస్సులో వచ్చానని తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అనిల్ కూర్మాచలాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీలు బండ ప్రకాశ్, శంభీపూర్ రాజు, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సినీ దర్శకుడు శంకర్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్గౌడ్ తదితరులు అభినందించారు.