హైదరాబాద్, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ): జ్యోతి ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసిన ట్రాన్స్ఫ్లుత్రిన్ (ట్రేడ్ నేమ్: మాక్సో ఏ-గ్రేడ్) పురుగుల మందుపై కేంద్ర వ్యవసాయశాఖ నిషేధం విధించింది. నాణ్యత పరీక్షలో నాసిరకం అని తేలడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపింది.
ఈ నేపథ్యంలో రైతులు ఎవరూ ఈ పురుగు మందును పంటలకు వినియోగించొద్దని, వ్యాపారులు విక్రయించొద్దని సూచించింది.