Fuel Price | న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని భావిస్తున్నది. ఈ మేరకు కసరత్తు కూడా చేసినట్టు సమాచారం. లీటరు పెట్రోల్, డీజిల్పై కనీసం రూ.4 నుంచి రూ.10 వరకు తగ్గించేలా ప్రణాళికలు రచిస్తున్నది.
అయితే ఈ భారం అయిల్ కంపెనీలపై పడకుండా ఉండేందుకు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించుకోవాలని కేంద్రం ఆలోచిస్తున్నది. ఓ వైపు అంతర్జాతీయంగా క్రూడ్ అయిల్ ధరలు తగ్గడం, మరోవైపు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో ఇంధన ధరలు తగ్గనున్నాయి.