హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో 6 అణువిద్యుత్తు కేంద్రాల ఏర్పాటు కోసం అమెరికాకు చెందిన వెస్టింగ్హౌస్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్టు కేంద్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్ చెప్పారు.వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.
వెస్టింగ్హౌస్ కంపెనీతో చర్చలు ముగిసిన అనంతరం అణువిద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు అయ్యే ఖర్చు, నిర్మాణానికి పట్టే సమయం వంటి వివరాలతో ప్రాజెక్ట్ ప్రతిపాదనలు ఖరారవుతాయని వివరించారు. కొవ్వాడ అణు విద్యుత్తు ప్రాజెక్ట్కోసం 2,079 ఎకరాలు అవసరమని,ఇప్పటికే 2,061 ఎకరాల భూసేకరణ పూర్తయిందని తెలిపారు.