హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఉత్తమ విచారణ విభాగంలో ఈ ఏడా ది కేంద్ర హోంమంత్రి మెడల్కు తెలంగాణ నుంచి ఐదుగురు పోలీసు ఉన్నతాధికారులు ఎంపికయ్యారు. ‘యూనియన్ హోంమినిస్టర్ మెడల్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్’ కు దేశవ్యాప్తంగా 140 మంది అధికారులు ఎంపికయ్యారు. నేర పరిశోధనలో ఉన్నతమైన వృత్తి ప్రమాణాలను పాటిస్తూ.. దర్యాప్తును వేగవంతంగా పూర్తిచేసినందుకుగాను ఈ విభాగంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా నుంచి మెడల్ను స్వీకరించనున్నారు. ఈ మెడల్ అందుకొనేవారిలో తెలుగు రాష్ర్టాల నుంచి పది మంది ఉన్నారు. సీబీఐ నుంచి 15 మంది, ఎన్ఐఏ నుంచి 12 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది, కేరళ 9 మంది, రాజస్థాన్ 9 మంది, ఇతర రాష్ర్టాల నుంచి 140 మంది అధికారులున్నారు. వీరిలో 22 మంది మహిళా పోలీసు అధికారులున్నారు.