హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): చేనేత కళాకారులకు గొప్ప గొప్ప హామీలిచ్చిన ప్రధాని నరేంద్రమోదీ మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన ఉం డటం లేదని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ధ్వజమెత్తింది. చేనేత రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, చేనేత కళాకారులకు ఉద్యోగ భద్ర త, సరైన వేతనాలు లభిస్తాయని చెన్నైలో జాతీయ చేనే త దినోత్సవ ఆవిర్భావ సభలో చెప్పిన మోదీ.. చేతల్లో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడింది.
ఇకనైనా చేనేతపై జీఎస్టీని తొలగించి, నేత కళాకారులను ఆదుకోవాలని కోరింది. ఈ మేరకు అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఇటీవల ప్రధానికి లేఖ రాసింది. ఆ లేఖను చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్న శుక్రవారం విడుదల చేశారు.