హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): వైద్యరంగంలో తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్ర సర్కారు ఎన్నిసార్లు విన్నవించినా ఒక్క మెడికల్ కాలేజీ కేటాయించకుండా మోసం చేసిన మో దీ సర్కారు ఇప్పుడు నర్సింగ్ కాలేజీల విషయంలోనూ మొండిచెయ్యి చూపింది. దేశవ్యాప్తంగా 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. అయితే, వీటిని గతం లో మంజూరు చేసిన మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తామంటూ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో మనకు కనీసం ఒక్క నర్సిం గ్ కాలేజీ దక్కే అవకాశం లేకుండా పోయిం ది.
సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ర్టాల్లో 2014 నుంచి ఇప్పటివరకు మూడు దశల్లో 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసింది. ఇందులో బీజేపీ పాలిత రాష్ర్టాలకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిం ది. యూపీకి 27, అసోంకు 5, మధ్యప్రదేశ్ 8, గుజరాత్లో 5 కాలేజీలు ఏర్పాటు చేసింది. వీటి నిర్మాణానికి అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం భరిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం భరించాలి. కేంద్రం ఇప్పటివరకు ఈ కాలేజీలకు రూ.18వేల కోట్లకుపైగా ఖర్చు చేసింది. ఒక్కో కాలేజీకి రూ.150 కోట్ల నుంచి 200 కోట్లు విడుదల చేసింది.
కేంద్రం సహకరించకున్నా జిల్లాకో కాలేజీ
కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించకపోయినా సీఎం కేసీఆర్ వెనుకడుగు వేయడం లేదు. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవ లు అందించాలనే లక్ష్యంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. మొదటి విడతలో 4, రెండో విడతలో 8 వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. నిరుడు నవంబర్ 15న 8 కాలేజీల్లో తరగతులు ప్రారంభించి, దేశ వైద్య ఆరోగ్య రంగంలోనే తెలంగాణ కొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర సర్కారు అనుమతులు, నిధులు మంజూరు చేసింది. వీటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ ర్పాటు చేసిన కాలేజీలకు ఒక్కోదానికి కేంద్రం వాటా కింద సగటున రూ.175 కోట్లు విడుదల చేసినా.. 12 కాలేజీలకు సుమారు రూ.2,100 కోట్లు వచ్చేవి. కేంద్రం కుట్ర కారణంగా రాష్ట్రం ఈ మొత్తాన్ని నష్టపోయింది.