హిమాయత్నగర్, మార్చి 4: కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం హిమాయత్నగర్లోని మక్దూం భవన్లో జరిగిన సీపీఐ ప్రజాసంఘాల ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన ఏడున్నరేండ్ల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బలమైన పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు.