హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడుతుందని లోక్సభ బీఆర్ఎస్(BRS) పక్ష నేత నామా నాగేశ్వర్రావు(Nama Nageshwar) ధ్వజమెత్తారు. ఉద్యోగాల(Employment) భర్తీ విషయంలో కేంద్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ(Parliament)లో నామా అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
కేవలం 10 శాఖల్లోనే 10 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నట్లు పేర్కొనగా అన్ని శాఖల్లో ఇంకెన్ని లక్షల ఖాళీలు ఉన్నాయని నామా ప్రశ్నించారు. తక్షణమే ఖాళీగా ఉన్న పోస్టు(Posts)లను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు సహా వివిధ ప్రభుత్వ శాఖల్లో భర్తీచేయాల్సిన పోస్టుల వివరాలను (ఖాళీలను) సంవత్సరాల వారీగా తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
దేశ వ్యాప్తంగా వివిధ శాఖల్లో మార్చి 1, 2021 నాటికి 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆ ఖాళీలను సమయానుకూలంగా భర్తీచేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్రం అందజేసిన సమాచారం పూర్తిగా అసంబద్ధంగా ఉందని, గతంలో ఆయా శాఖల్లో 16 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పిన కేంద్రం(Central) తీరా ఇప్పుడు పది శాఖల్లో దాదాపు 10 లక్షలేనని చెప్పటం కేంద్రం రెండు నాల్కల ధోరణికి నిదర్శమని మండిపడ్డారు.