హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఏటా సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ కేంద్ర హోంశాఖ ఈ నెల 12న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రావి నారాయణరెడ్డి సేవా సంస్థ ఇటీవల రాసిన లేఖకు స్పందించి కేంద్రం ఈ నోటిఫికేషన్ను జారీ చేసింది.
1948 సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం నిజాం నవాబుకు వ్యతిరేకంగా ‘ఆపరేషన్ పోలో’ పేరుతో పోలీస్ చర్య చేపట్టడంతో హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైన విషయాన్ని వివరిస్తూ గత నెల 16న ప్రధానికి ఓ లేఖ రాశామని, ఆ లేఖకు మోదీ స్పం దించి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ఆమోదం తెలిపారని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.