మెదక్, జూన్ 2 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మెదక్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్లో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మార్కెట్కు వచ్చే ప్రజలు తప్పకుండా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. మార్కెట్ నిర్వహణ ఏరియాలో ప్రతి రోజు రెండు సార్లు శానిటేషన్ పనులు చేపట్టాలని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, సిబ్బందికి ఆదేశించారు. మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్తాచెదారాన్ని కూడా శుభ్రపర్చాలని సూచించారు. ఆమె వెంట ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు జయరాజ్, కూరగాయల అసోసియేషన్ మార్కెట్ అధ్యక్షుడు కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.