హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వర్సిటీ సివిల్ సర్వీసెస్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి, పోటీ పరీక్షలకు కావాల్సిన రిఫరెన్స్ పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వీసీ ప్రొఫెసర్ రవీందర్ చెప్పారు. వర్సిటీలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు కష్టపడి చదువుకుంటే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చ న్నారు. ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు అనేక దేశాల్లో ఉన్నతస్థానాల్లో ఉన్నారని గుర్తుచేశారు. బుధవారం ఓయూ ఇంజినీరింగ్ (అటానమస్) కాలేజీలో బీసీ-1 సెమిస్టర్ ఓరియంటేషన్ కార్యక్రమంలో వారు మాట్లాడారు. బీఈలో కోర్ గ్రూపులతోపాటు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్లర్నింగ్, 3డీ టెక్నాలజీ వంటివి ఉన్నాయని, వాటిల్లోనూ మంచి ప్రతిభ కనబర్చాలని సూచించారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరామ్వెంకటేశ్, డీన్, సీనియర్ ప్రొఫెసర్లు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వర్సిటీ సివిల్ సర్వీసెస్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి, పోటీ పరీక్షలకు కావాల్సిన రిఫరెన్స్ పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వీసీ ప్రొఫెసర్ రవీందర్ చెప్పారు. వర్సిటీలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు కష్టపడి చదువుకుంటే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చ న్నారు. ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు అనేక దేశాల్లో ఉన్నతస్థానాల్లో ఉన్నారని గుర్తుచేశారు. బుధవారం ఓయూ ఇంజినీరింగ్ (అటానమస్) కాలేజీలో బీసీ-1 సెమిస్టర్ ఓరియంటేషన్ కార్యక్రమంలో వారు మాట్లాడారు. బీఈలో కోర్ గ్రూపులతోపాటు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్లర్నింగ్, 3డీ టెక్నాలజీ వంటివి ఉన్నాయని, వాటిల్లోనూ మంచి ప్రతిభ కనబర్చాలని సూచించారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరామ్వెంకటేశ్, డీన్, సీనియర్ ప్రొఫెసర్లు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.