హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్సిసోడియా కేసులో సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత నుంచి వివరణ తీసుకున్నారు. రాఘవేంద్ర వస్త నాయకత్వంలోని సీబీఐ బృందం ఆదివారం ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. సీబీఐ అధికారుల విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పూర్తిగా సహకరించాయి.
విచారణ అనంతరం కవిత నివాసానికి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, కార్పొరేషన్ల చైర్మన్లు అయాచితం శ్రీధర్, గజ్జెల నగేశ్, అనిల్ కూర్మాచలం, శాట్స్ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దేవీప్రసాద్, రూప్సింగ్, గెల్లు శ్రీనివాస్యాదవ్, బాబా ఫసియుద్దీన్ తదితరులు వెళ్లి ఆమెతో మాట్లాడారు. సీబీఐ అధికారులు వచ్చి వెళ్లిన తర్వాత ఆమె ప్రగతిభవన్కు వెళ్లి సీఎం కేసీఆర్ను కలిసి వచ్చారు.