హైదరాబాద్ : ఓ ఇద్దరు ఆదాయపు పన్ను శాఖ అధికారులు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డారు. ఇద్దరిలో ఒకరు హైదరాబాద్కు చెందిన అధికారి కాగా, మరొకరు విశాఖపట్టణంకు చెందిన ఆఫీసర్.
సీబీఐ అధికారుల కథనం ప్రకారం.. టీడీఎస్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి ఇద్దరు ఆదాయపు పన్ను శాఖ అధికారులు రూ. లక్ష డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన అడిషనల్ సీఐటీ ఆఫీస్లో పని చేస్తున్న సీనియర్ ట్యాక్స అసిస్టెంట్, వైజాగ్లో పని చేస్తున్న మరో సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్ కలిసి సదరు వ్యక్తిని రూ. లక్ష డిమాండ్ చేశారు. అంత పెద్ద మొత్తంలో లంచం ఇవ్వలేనని బాధిత వ్యక్తి తెలిపాడు. మొత్తంగా రూ. 60 వేలు ఇస్తానని బాధితుడు ఒప్పుకున్నాడు. అనంతరం సీబీఐ అధికారులను ఆశ్రయించాడు. ఇవాళ హైదరాబాద్ ఆఫీసర్కు రూ. 40 వేలు లంచం ఇస్తుండగా సీబీఐ అధికారులు అతన్ని పట్టుకున్నారు. వైజాక్ అధికారికి ఆన్లైన్లో పే చేసినట్లు నిర్ధారించారు. ఈ ఇద్దరు అధికారుల నివాసాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు.