హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రధాని ఒక రాష్ట్రంలో పర్యటిస్తున్నారంటే ప్రభుత్వం, అక్కడి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొంటారు. తమ ప్రాంత అభివృద్ధికి నిధులు ఇస్తారని ప్రజలు ఎదురుచూస్తే.. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలో, అనుమతులో, కొత్త ప్రాజెక్టులో మంజూరు చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాలు ఆశపడతాయి.కానీ.. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ మాత్రం ఇందుకు భిన్నం. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో మోదీ పర్యటిస్తున్నారంటే.. అక్కడ ఏదో ఒక అలజడి రేగటం పరిపాటిగా మారింది. మోదీ పర్యటన ఖరారైందంటే చాలు.. ఆయన వచ్చే ముందో, తర్వాతనో కచ్చితంగా ఆ రాష్ట్రంలో ఐటీ, ఈడీ, సీబీఐ వంటి జాతీయ దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేస్తాయి. గత అనుభవాలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది. వీలైతే అధికార పార్టీ నేతలను టార్గెట్ చేస్తారు.. లేదంటే ఇతర సంస్థలపై దాడులు చేసి ఆ రాష్ట్రంలో ఏదో జరుగుతున్నట్టు సీన్ సృష్టిస్తారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది కూడా అదే. శనివారం ప్రధాని రామగుండంలో పర్యటించనున్నారు. ఇందుకు నాలు గు రోజుల ముందే రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసాల్లో ఈడీ సోదాలు జరిగాయి.
అవినీతి ముద్ర వేసేందుకే..
బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ర్టాల్లో అవినీతి జరుగుతున్నదని ముద్ర వేసేందుకే ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేస్తుంటారని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఐటీ, ఈడీ, సీబీఐ సోదాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు జరగవు? అని నిలదీస్తున్నారు. అక్కడ అంతా సస్యశ్యామలంగా, పారదర్శంగా పాలన సాగుతున్నట్టు కేంద్రం బిల్డప్ ఇస్తున్నదని మండిపడుతున్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ అవినీతిని ఏకంగా బ్యానర్లు కట్టి ప్రదర్శిస్తున్నా, ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేయవని ప్రశ్నిస్తున్నారు. ఈ దాడుల వెనుక డైవర్షన్ డ్రామా కూడా దాగున్నదని చెప్తున్నారు. మోదీ పర్యటన సమయంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన కొన్ని ఘటనలు
తెలంగాణ
రాజస్థాన్
పంజాబ్