హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): వక్ఫ్బోర్డు భూములపై సీబీసీఐడీతో దర్యాప్తు చేయిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీలో పల్లెప్రగతి-పట్టణ ప్రగతిపై స్వల్పకాల చర్చలో సీఎం మాట్లాడుతూ.. వక్ఫ్ భూములపై విచారణకు తమకెలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. దేవాదాయశాఖ, వక్ఫ్బోర్డు భూములు ప్రస్తుతం ఫ్రోజెన్లో ఉన్నాయని, ప్రభుత్వపరంగా వాటి రిజిస్ట్రేషన్, లేదా ఇతర అనుమతులకు వీలులేదన్నారు. ‘ప్రభుత్వం తరఫున కోర్టులో వక్ఫ్ భూముల గురించి సరిగా వాదించడం లేదని అక్బరుద్దీన్ నా చాంబర్కు వచ్చి చెప్పారు. కొన్నిసార్లు అలాంటివి జరుగుతున్నాయి. వక్ఫ్బోర్డుల విషయంలో జరిగిన దుర్మార్గాలపై సీబీసీఐడీ దర్యాప్తు చేయాలని మేం ఈ రోజే ఆదేశిలిస్తాం’ అని చెప్పారు.