Jagtial | జగిత్యాల : జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలో గణేశ్పల్లిలో ఓ కుటుంబాన్ని కులబహిష్కరణ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. కత్తులు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సారంగపూర్ పోలీసులు గణేశ్పల్లికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.