హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా నగదు, మద్యం, బంగారం పట్టుబడుతున్నాయి.
శుక్రవారం రాత్రి నాటికి మొత్తం రూ.286.74 కోట్ల విలువైన సొమ్మును స్వాధీనం చేసుకొన్నారు. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా రూ.16.56 కోట్ల నగదు పట్టుబడింది. ఇప్పటివరకు రూ.12.21 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేశారు.