కాశీబుగ్గ, మే 29 : పురావస్తు శాఖ అనుమతి లేకుండావరంగల్ కోటలోకి ప్రవేశించడంతోపాటు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ధర్నా చేశారం టూ బీఆర్ఎస్ నాయకులపై మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో రెండు కేసులు నమోదైనట్టు సీఐ మల్లయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వం నూతనంగా తయారు చేసిన చిహ్నంలో కాకతీయ తోరణం తొలగింపును వ్యతిరేకిస్తూ బుధవారం ఖిలావరంగల్ కోటలో బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ బీ వినోద్కుమార్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్రెడ్డి, దాస్యం వినయ్భాస్కర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగు రాకేశ్రెడ్డితోపాటు పలువురు కార్పొరేటర్లు, నాయకులపై కేసులు నమోదయ్యాయి.