హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోసం హైదరాబాద్లో నిర్వహించిన ర్యాలీపై ఎన్హెచ్ఆర్సీలో మంగళవారం కేసు నమోదైంది. ‘స్కిల్’ కేసులో జైలు నుంచి విడుదలైన బాబును హైదరాబాద్కు తీసుకొచ్చే క్రమంలో టీడీపీ శ్రేణులు బేగంపేట నుంచి జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా బంజారాహిల్స్ రోడ్లపై న్యూసెన్స్ క్రియేట్ చేశారని, అంబులెన్స్కు సైతం దారి ఇవ్వకుండా ప్రాణాలతో చెలగాటం ఆడారని హైకోర్టు న్యాయవాది ఇమ్మనేని రామారావు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై కేసు నమోదైంది.