హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేయడంలో ఇకపై జాగ్రత్తగా వ్యవహరించాలని హైకోర్టు కరీంనగర్ టూటౌన్ ఎస్హెచ్వోను హెచ్చరించింది. తనపై రెండవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కుమారుడు వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేసినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదంటూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. దీంతో ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యానికి దారితీసిన కారణాలను తెలియజేస్తూ ఎస్హెచ్వో వెంకట్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 13న మరో కేసు విచారణ ఉండటంతో తాను స్టేషన్లో అందుబాటులో లేనని, బాధితురాలి సమస్య 14న తన దృష్టికి వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వివరణ ఇచ్చారు. దీంతో ఇకపై జాగ్రత్తగా ఉండాలని ధర్మాసనం వెంకట్ను హెచ్చరిస్తూ.. బాధితురాలి పిటిషన్పై విచారణను ముగించింది.