జనగామ చౌరస్తా, నవంబర్ 26: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై ఆదివారం జనగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అర్బన్ ఇన్స్పెక్టర్ ఎలబోయిన శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15న జనగామ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ప్రగతి భవన్ను బాంబులతో పేల్చివేయాలని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ 150 పడక గదుల రాజభవన గృహాన్ని రూ.2 వేల కోట్లతో నిర్మించారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్లోకి తెలంగాణ వాళ్లకు, దళితులు, నిరుద్యోగులు, ప్రజా ప్రతినిధులకు ప్రవేశం లేదని ఆరోపణలు చేశారు. కమ్యూనిస్టు పార్టీలకు కూడా ప్రవేశం లేదన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జనగామ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు రేవంత్రెడ్డిపై అర్బన్ పీఎస్లో కేసు నమోదు చేశారు.