సంగారెడ్డి : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish rao), మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నాయకుడు రఘునందన్ రావు( Raghunandan Rao) పై సంగారెడ్డి పోలీసు స్టేషన్లో(Sangareddy Police Station) కేసు నమోదు అయింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు ఉల్లంఘన సహా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.