హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద శనివారం ఒకేరోజు రాష్ట్ర ప్రభు త్వం 106 మంది లబ్ధిదారులకు కార్లు అందజేసింది. జీవనోపాధికి భరోసా కల్పించింది. హైదరాబాద్ హజ్హౌస్లో జరిగిన కార్ల పంపిణీ సభలో ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోంమంత్రి మహమూద్అలీ పాల్గొన్నారు. డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద కేవలం కార్లు ఇవ్వటమే కాకుండా ఉబర్తో అనుసంధా నం చేయటం ద్వారా క్రమశిక్షణాయుత జీవితానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నదని మంత్రి కొప్పుల పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా, సామాజికంగా పదిమందికి ఆదర్శంగా నిలువాలని సూచించారు. మైనార్టీల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. డ్రైవర్ కమ్ ఓనర్ పథకం ద్వారా లబ్ధిపొందినవారు యజమాని అనే భరోసాతో జీవనం సాగించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి మహమూద్ అలీ సూచించారు. వక్ఫ్బోర్డు చైర్మన్ మహమ్మద్ సలీమ్ మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమానికి పాటుపడుతున్న నంబర్ 1 సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సయ్యద్ అమినుల్ హసన్ మేరజ్, ప్రభుత్వ మైనార్టీ సలహాదారు ఏకే ఖాన్, మైనారిటీ వెల్ఫేర్ కార్యదర్శి అహ్మద్ నదీమ్, మైనార్టీ వెల్ఫేర్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, టీఎస్ఎంఎఫ్సీ వైస్ చైర్పర్సన్ కాంతివెస్లీ, ఎస్బీఐ ఏజీఎం రాజేందర్కుమార్, ఉబర్ ఇండియా ఆపరేషన్ మేనేజర్ వెంకటేశ్వర్రెడ్డి, కార్పొరేటర్ సురేఖ తదితరులు పాల్గొన్నారు.