కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఓని ఇల్లందులో పెను ప్రమాదం తప్పింది. ఇల్లందు మండలంలోని మసివాగు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తా పడింది. అయితే ఎయిర్ బెలూన్స్ తెరచుకోవడంతో అందులో ఉన్న ముగ్గురికి ముప్పు తప్పంది. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఇల్లందు వైద్యశాలలో ప్రధమ చికిత్స అందించారు. అనంతరం బాధితులను వరంగల్ ఎంజీఎం తీసుకెళ్లారు. ఈ ఘటనపనై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.