సిద్దిపేట : దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద బుధవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. రామాయంపేట నుంచి సిద్దిపేట వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి బావిలో పడ్డ కారును వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు. రెండు ఫైరింజన్లతో బావిలోని నీటిని ఖాళీ చేస్తున్నారు. బావిలో ఉన్న నీటిని పూర్తిగా తోడేస్తే తప్ప కారులో ఎంత మంది ఉన్నారనేది తెలియని పరిస్థితి నెలకొంది. బావి లోతు సుమారు 15 నుంచి 20 గజాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.