రంగారెడ్డి: జిల్లాలోని కందుకూరు మండల కేంద్రంలో కారు బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున శ్రీశైలం హైవేపై వేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనాలను ఢీకొట్టింది. దీంతో ఓ కారు, మోటారు సైకిల్ ధ్వంసమయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. బెలూన్లు తెరచుకోవడంతో కారులో ఉన్నవారికి ప్రమాదం తప్పింది.