హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : క్యాన్సర్ అనేది ప్రజారోగ్యానికి సవాల్గా మారిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ నోవాటెల్లో జరిగిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకలో పా ల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. క్యాన్సర్ చికిత్సలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, వైద్యనిపుణులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. పాతికేండ్లుగా క్యాన్సర్ బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న బసవతారకం క్యాన్సర్ దవాఖా న యాజమన్యం, వైద్యులు, సిబ్బంది, దాతలను మంత్రి అభినందించారు. దివంగత ఎన్టీఆర్ దూరదృష్టికి ఈ దవాఖాన ప్రతీకగా నిలిచిందని కొనియాడారు. సంస్థను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్తున్న చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ సేవలను మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు.