హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): హెటిరో సంస్థకు చెందిన సాయి సింధు ఫౌండేషన్కు గతంలో తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన భూముల లీజును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానమేట్ సర్వే నంబర్ 41/14/2లోని 15 ఎకరాలను గత ప్రభుత్వం సింధు ఫౌండేషన్కు కేటాయించింది.
క్యా న్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధుల కోసం హాస్పిటల్ నిర్మించేందుకు లాభాపేక్ష లేకుండా 30 ఏండ్ల కాలానికి భూమిని లీజుకు ఇచ్చింది. ఏటా రూ.1,47,743 ఫీజు ను ఫౌండేషన్ చెల్లించేలా నిర్ణయించింది. ఈ మేరకు గ తంలో జీవో 140ని జారీచేసింది. ఇందులో ఇప్పటికే భవ న నిర్మాణాలను ప్రారంభించారు. అయితే ఈ జీవో 140 ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.