వాగు దాటి వ్యాక్సిన్ వేశారు నిర్మల్ జిల్లా పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది. మారుమూల గిరిజన గ్రామమైన యాపల్గూడలో ఆదివారం కరోనా వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ గ్రామానికి వెళ్లాలంటే మధ్యలో కడెం వాగు దాటాలి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. అయినప్పటికీ వైద్య సిబ్బంది వాగుదాటి వెళ్లి అక్కడి గిరిజనులకు టీకాలు వేశారు. వాగు దాటివచ్చి వ్యాక్సిన్ వేసినందుకు వైద్యాధికారి నాగరాజుతోపాటు సిబ్బందిని స్థానికులు అభినందించారు. – పెంబి