హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ‘నా స్టడీ సర్టిఫికెట్లు చూపిస్తా’ అంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాను పుణె యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ, సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్లో బిజినెస్లో మాస్టర్ డిగ్రీ చేసినట్టు ఆయన వెల్లడించారు.
అందుకు సంబంధించిన సర్టిఫికెట్లను పబ్లిక్గా షేర్ చేయొచ్చా! అని నెటిజన్లను అడుగుతూ ట్వీట్ చేశారు. మోదీ విద్యార్హతల సర్టిఫికెట్లను చూపెట్టాల్సిన అవసరమేమీ లేదని, ఆర్టీఐ కింద దరఖాస్తు చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు రూ.25 వేల జరిమానా విధిస్తూ గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఆసక్తి రేకెత్తిస్తున్నది.