హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): సుమారు నెల రోజులపాటు హోరాహోరీగా సాగిన మునుగోడు ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. సీఈవో వికాస్రాజ్ మంగళవారం చండూర్లో పర్యటించి పోలిం గ్, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్టు సీఈవో తెలిపారు. 3,366 మంది రాష్ట్ర పోలీసులు, 15 కంపెనీల కేంద్ర బలగాలతో పటిష్ఠ భద్రతా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.