హైదరాబాద్ : తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. బండా ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. నేటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం కల్పించారు. 20వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. 30వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను ప్రకటించనున్నారు.
రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ స్థానం ఏర్పడింది. ఏప్రిల్ 2, 2024తో వరకు ఈ స్థానానికి కాలపరిమితి ఉండటంతో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.