అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి
మన్సూరాబాద్, మే 1: ఆత్మీయ సమ్మేళనాల ద్వారా పరిచయాలు పెరిగి వ్యాపార రంగం అభివృద్ధి సాధిస్తుందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ మన్సూరాబాద్లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో మూడు రోజులుగా నిర్వహించిన రెడ్డి వ్యాపారస్తుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ముగిసింది.
చివరి రోజు ముఖ్యఅతిథిగా హాజరైన పోచారం.. స్టాళ్లను పరిశీలించి మాట్లాడారు. వ్యాపార రంగంలో ఉన్న రెడ్డి కులస్తులను ఒకే వేదికపై తీసుకొచ్చేందుకు నిర్వాహకుల కృషి ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మె ల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, రెడ్డి వ్యాపారస్తుల నెట్వర్క్ (ఆర్బీఎన్) ఫౌండర్ కొలను వెంకటేశ్వర రెడ్డి, ఆర్గనైజర్స్ సంజీవరెడ్డి, అభిమన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.