యాదాద్రి, జనవరి 8: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి విమాన గోపురం స్వర్ణతాపడానికి విరాళాల సేకరణ కొనసాగుతున్నది. ఆలయ పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్రావు ఇచ్చిన పిలుపు మేరకు పలువురు ముందుకొచ్చి విరాళాలు అందజేస్తున్నారు. శనివారం ఆలయ ఈఓ ఎన్ గీతకు పలువురు భక్తులు రూ.2.10 లక్షల విరాళాలు అందజేశారు. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త వేమన మురళి- విజయలక్ష్మి దంపతులు రూ.1.08 లక్షల చెక్కు ఆలయ అధికారులకు ఇచ్చారు. యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం యాదవ్-ప్రేమలత దంపతులు రూ.51 వేలు, వంగపల్లి సర్పంచ్ కానుగు కవిత-బాలరాజు దంపతులు రూ.51 వేలు అందజేశారు.