గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొట్టుకున్నాయి. ధరూర్ మండల పరిధిలోని అల్వాలపాడు గ్రామం మైలగడ్డ సేజీ మధ్య ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నది. బస్సు గద్వాల నుంచి రాయచూర్ వెళ్తున్నది. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిన్నది.