పాలకుర్తి, మార్చి 7: వేసవి రావడం రావడంతోనే ఎండలు దంచి కొడుతుండగా వరి పొలాలు ఎండిపోతున్నాయి. నీళ్లందక నెర్రె లు బారుతున్నాయి. బీఆర్ఎస్ హ యాంలో 24 గంటల కరెంటు ఉన్నా ఒక్క ట్రాన్స్ఫార్మర్ కాల లేదని, ప్రస్తుతం 24 గంటల కరెంట్ లేకపోయినా రోజుకోచోట ట్రాన్స్ఫార్మర్ కాలి పొలాలు ఎండుతుండటంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో లోవోల్టేజీ సమస్యతో తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. దీంతో వరి పొలాలు నీళ్లందక ఎండిపోయి నెర్రెలు బారుతున్నాయి. పాలకుర్తి మండలంలోని దర్దేపల్లిలో గత శుక్రవారం ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని, వారం రోజులైనా విద్యుత్తు అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని దాని పరిధిలోని రైతులు జలగం అంజయ్య, కర్నె రవి, నిమ్మల యాక య్య, ముస్కు నాగయ్య, ఓరుగంటి పుల్ల య్య, మేడికోదండ రామయ్య, కూస మ హేందర్తోపాటు పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం కొత్త ట్రాన్స్ఫార్మర్ బిగించినా లాభంలేదని అన్నారు. సగం మో టర్లు నడవక మళ్లీ ట్రాన్స్ఫార్మర్ను ఇప్పి సబ్స్టేషన్కు తీసుకెళ్లినట్టు తెలిపారు. సిబ్బం ది, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఎండుతున్న పంటలను చూస్తే కన్నీళ్లు కారుతున్నాయని, అధికారుల నిర్లక్ష్యంతోనే పంటలు ఎండుతున్నాయని రైతులు వాపోయారు. తక్షణమే అధికారులు స్పందించి నాణ్యమైన కరెంటు అందించాలని రైతులు కోరుతున్నారు.