వరంగల్ : తెలంగాణ ప్రగతి భవన్ను గ్రైనేడ్స్తో పేల్చివేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు రేవంత్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపురం, నల్లబెల్లి, దుగ్గొండి మండల కేంద్రాల్లో దిష్టిబొమ్మలను దహనం చేశారు.
పార్టమెంట్ సభ్యుడుగా ఉండి పరిపాలనా భవనం, తెలంగాణ ప్రగతికి చిహ్నమైన ప్రగతి భవన్ ను పేల్చేయమనటం హేయమైన చర్య అని అన్నారు. అతడిపై పీడీ యాక్టు కింద కేసుపెట్టి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. లేదంటే ప్రజలు, ఉద్యమకారులు తగిన బుద్ధి చెపుతారని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి, సీతక్కలపై చర్యకు చట్టపరంగా పోరాడుతాం..
ప్రగతి భవన్ పై కుట్రపన్నిన రేవంత్ రెడ్డి, సీతక్క ల పై చట్టపరంగా పోరాడుతామని ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ వెల్లడించారు. ములుగులో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీతక్క స్క్రిప్ట్ ప్రకారమే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి సీఎం కేసీఆర్ను విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు. రేవంత్ భాష జంతువులు సైతం సిగ్గు పడే విధంగా ఉన్నాయని ఆరోపించారు.రేవంత్ రెడ్డి, సీతక్క చంద్రబాబు ఏజెంట్లని తెలిపారు. నక్సలైట్లతో రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధాలను బహిరంగపరచాలని డిమాండ్ చేశారు.మేడారం యాత్రలో రేవంత్ రెడ్డికి తొలి అడుగు కాదని కాంగ్రెస్ పార్టీకి అది చివరి అడుగని విమర్శించారు.